పోలేరమ్మ ఆలయానికి భారీగా భక్తులు
ప్రకాశం: జరుగుమల్లి మండలంలో కామేపల్లిలో వెలసిన శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం ఆదివారం కిక్కిరిసింది అమ్మవారి దర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చారు. భక్తుల రాకతో ఈ ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు మొక్కుబళ్ళు తీర్చుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.