పేదల ఇళ్లల్లో సోలార్ వెలుగులు
PLD: పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా పేదల ఇళ్లలో సౌర విద్యుత్ వెలుగులు నింపుతున్నామని ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. రొంపిచర్ల మండలంలో రూ.2.21 కోట్ల వ్యయంతో విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సుబ్బయ్య పాలెంలో 77 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సోలార్ ప్యానెల్ ప్రారంభించారు.