కువైట్‌ చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ దాడి

కువైట్‌ చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ దాడి

దుబాయ్‌ పోర్టు వద్ద కువైట్‌ చమురు ట్యాంకర్‌ 'అల్‌ సల్మీ'పై ఇరాన్‌ డ్రోన్‌తో దాడి చేసింది. దీంతో నౌకలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన సమయంలో ట్యాంకర్‌ నిండా చమురు ఉంది. సముద్రంలో చమురు ఒలికిపోయే ప్రమాదం ఉందని కువైట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ తెలిపింది. దాడి విషయాన్ని దుబాయ్‌ అధికారులు ధ్రువీకరించారు.