మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్!
మాలి దేశంలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్నకు గురయ్యారు. కోబ్రి ప్రాంతంలో ఓ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులపై దుండగులు ఆయుధాలతో దాడి చేశారు. ఐదుగురు భారతీయులను అపహరించి తీసుకెళ్లినట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ముఠాల నుంచి ఇంకా ప్రకటన రాలేదు.