ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
NGKL: అమ్రాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని అచ్చంపేట ఎమ్మెల్యే సతీమణి, సీబీఎం ట్రస్ట్ ఛైర్పర్సన్ డాక్టర్ అనురాధ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సౌకర్యాల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు.