ప్రాజెక్టును టూరిజం స్పాట్గా అభివృద్ధి: కలెక్టర్

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టును టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. నేడు ప్రాజెక్టు వద్ద ఉన్న గోల్బంగ్లా, గార్డెనింగ్, బోటింగ్ పాయింట్ పరిసరాలను పరిశీలించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్తో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. రూ. 10 కోట్ల వ్యయంతో టూరిజం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.