ఎమ్మెల్యే వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నాం

SKLM: పొందూరు మండలం లోలుగులో తీవ్ర ఘటన చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, అతని అనుచరులు వేధించారంటూ కేజీవీబీ మహిళా ప్రిన్సిపాల్ సౌమ్య సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రెండు నెలలుగా అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ తెలిపింది. నాకు పోరాడే శక్తి లేకే చనిపోవడానికి సిద్ధమయ్యానాని వాపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.