పెద్దకేసుపురం ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి
SKLM: మందస మండలం పెద్దకేసుపురంలో పిడుగుపడి ఇద్దరు మృతి చెందడంపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. ఈ ఘటన అధికారులకు ఫోన్లో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.