తిరుమల సమాచారం

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. స్వామివారి దర్శనం కోసం 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,095 మంది భక్తులు దర్శించుకోగా.. 26,912 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా.. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.