VIDEO: చందనోత్సవం టికెట్ల గందరగోళం.. భక్తుల ఆగ్రహం
VSP: విశాఖపట్నంలోని సింహాచలం చందనోత్సవం టికెట్ల విక్రయంలో గందరగోళం నెలకొంది. కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు, ఆన్లైన్, వాట్సాప్ సేవల్లో టికెట్లు దొరకకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిపై భక్తులు ఈవో కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.