రేపు నన్నయ వర్సిటీలో సైన్స్ డే వర్క్ షాప్
తూ.గో: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో శనివారం ‘శాస్త్రజగతి-వికసిత భారత మహిళా ఉత్ప్రేరక జాగృతి’ అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శుక్రవారం వర్సిటీలో దీనికి సంబంధించిన బ్రోచర్ను ఆమె ఆవిష్కరించారు. చార్టెడ్ అకౌంటెంట్ వి.వి.ఎస్. నారాయణ హాజరవుతారని వీసీ వెల్లడించారు.