జిల్లాలో పెరిగిన చలి

జిల్లాలో పెరిగిన చలి

NGKL: జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చలితీవ్రత విపరీతంగా పెరిగింది. గడిచిన 24 గంటలో అత్యల్పంగా కల్వకుర్తి మండలం తోటపల్లిలో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెలకపల్లి 9.8, బిజినపల్లి 9.9, కొండారెడ్డిపల్లి 10.2, కిష్టంపల్లి, యంగంపల్లి 10.4, అమ్రాబాద్ మండల కేంద్రంలో 10.5, ఎల్లికల్ 10.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.