రోడ్డుపై భారీగా రేషన్ బియ్యం పట్టివేత

రోడ్డుపై భారీగా రేషన్ బియ్యం పట్టివేత

NLR: కోవూరు వద్ద జిల్లా గ్రాండ్ హోటల్ సమీపంలో ఆదివారం రాత్రి ఒక వాహనాన్ని పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. ఆ వాహనంలో భారీగా PDS బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ బియ్యం ప్రకాశం జిల్లా మద్దిపాడు నుంచి కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి, స్టేషన్‌కు తరలించి వారిపై కేసు నమోదు చేశారు.