గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ

గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ

NRML: మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఏఎంసీ ఛైర్మన్ పడిగల భూషణ్ అన్నారు. ఎమ్మెల్యే బుజ్జి పటేల్ ఆదేశాల మేరకు కడెం మండలంలోని ఎలకడప గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ కార్యాలయం, వివో భవన నిర్మాణాలకు వారు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ రహీం, మహమ్మద్ సలీం ఉన్నారు.