'ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు'
VZM: కొత్తవలస ప్రధాన రహదారి పక్కన ఉన్న స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించుకున్నాడు. దీనిమీద ఫిర్యాదు అందడంతో స్థానిక తహసీల్దార్ అప్పలరాజు, రెవెన్యూ పరిశీలకులు షణ్ముఖరావు సిబ్బందితో వెళ్ళి ఆ స్థలాన్ని పరిశీలించి, జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించబోమని వారు కబ్జాదారులను హెచ్చరించారు.