శనగల కొనుగోలు షురూ.. క్వింటా రూ.5,875

శనగల కొనుగోలు షురూ.. క్వింటా రూ.5,875

ADB: ఉట్నూరు మండలం శ్యాంపూర్ సహకార దాల్ మిల్లో ప్రభుత్వ శనగల మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ విశ్వనాధ్ ప్రారంభించారు. క్వింటా శనగలకు ప్రభుత్వం రూ.5,875 మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు. రైతులు తమ పంటను బాగా ఎండబెట్టి, శుభ్రపరిచి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ జయవంత్ రావు, తదితరులు పాల్గొన్నారు.