ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
PDPL: పాలకుర్తి మండలం బసంత్ నగర్ ఎయిర్ పోర్టు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటను విక్రయించేందుకు ప్రతి మండలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.