లారీ, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

లారీ, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

CTR: పెద్ద పంజాణి మండలంలో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. ముత్తుకూరు నుంచి బైక్‌పై వస్తున్న అంజి అనే వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.