కల్తీ పాలు.. పెరిగిన మృతుల సంఖ్య
AP: రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. నిన్న రాజేంద్రనగర్కు చెందిన పిచ్చుక నాగేశ్వరరావు(72) అనే వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మూత్రపిండాలు దెబ్బతినడంతో చికిత్స అందించినా ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో ఈ ఘటనలో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 17కు చేరింది.