VIDEO: రహదారంతా గుంతలమయం.. సాగేదేలా పయనం
WGL: నర్సంపేట పట్టణం నుంచి మాదన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో నిండిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మొత్తం గుంతలమయంగా మారిపోవడంతో వాహనదారులు ప్రమాద భయంతో ప్రయాణం కొనసాగిస్తున్నారని స్థానికులు తెలిపారు. ప్రతి రోజు వివిధ అవసరాల నిమిత్తం నర్సంపేటకు వచ్చే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు ఆరోపించారు. అధికారులు స్పందించాలని అన్నారు.