గర్భిణులు ఆరోగ్య నియమాలు పాటించాలి: రాణి
W.G: గర్భిణిలు ఆరోగ్య, ఆహార నియమాలు పాటించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ డి.ఎస్తేరు రాణి సూచించారు. శుక్రవారం తాడేపల్లిగూడెం (M) చినతాడేపల్లి అంగన్వాడీ కేంద్రంలో మాతృ సంరక్షణ-పీఎంఎంవీవై కార్యక్రమంపై అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పాలు, కోడి గుడ్లు, చిరుధాన్యాలను ఆహారంలో తీసుకోవాలన్నారు.