'కాంత' ఓటీటీ రిలీజ్ అప్పుడే..?
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సె, సముద్రఖని, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కాంత'. థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈనెల 12 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు.