రాష్ట్రపతిని కలిసి ధన్యవాదాలు తెలిపిన లోకేష్
AP: మంత్రి నారా లోకేష్ రాష్ట్ర కూటమి ఎంపీలతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అమరావతి బిల్లుకు త్వరగా ఆమోదం తెలిపి, దానికి చట్టరూపం కల్పించిన నేపథ్యంలో ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని రాష్ట్రపతికి వివరించారు.