VIDEO: రూ. 8.5 కోట్లతో స్వచ్ఛాంధ్ర పనులు
అన్నమయ్య: తంబళ్లపల్లె MPDO కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ 'స్వచ్ఛరథం' వాహనాన్ని ప్రారంభించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రూ. 8.5 కోట్ల నిధులతో పారిశుధ్య పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ములకలచెరువు, కురబలకోట మండలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.