జలధార కార్యక్రమంపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్
E.G: జలధార కార్యక్రమం సత్ఫలితాలు సాధించడంలో ఇరిగేషన్తో పాటు ఇతర కోర్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద జలధార కార్యక్రమంపై క్షేత్ర స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో జలధార–జలహారతి కార్యక్రమాలు భూగర్భ జలాల పెంపులో దిశానిర్దేశంగా నిలుస్తాయన్నారు.