వృద్ధురాలికి బాసటగా నిలిచిన జనసేన నేత
విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వార్డు మాజీ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు రోడ్డుపై దీన స్థితిలో ఉన్న వృద్ధురాలికి బాసటగా నిలిచారు. అల్లిపురం, నేరెళ్ల కోనేరు ప్రాంతంలో ఆమెను గమనించి, లయ ఓల్డ్ ఏజ్ హోమ్కి తరలించారు. ఆమెకు ఎవరూ లేరని తెలుసుకుని ఆవేదన చెందారు. ఆయన చేసిన పనికి పలువురు అభినందించారు.