రెండోసారి గిన్నిస్ రికార్డ్స్లో తెలుగు కుర్రాడు
AP: కాకినాడ జిల్లా తునికి చెందిన యువ ఆవిష్కర్త సాయి రెండోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. అతి చిన్న మోటరైజ్డ్ మట్టి కుండల తయారీ యంత్రాన్ని రూపొందించి ఆయన ఈ అరుదైన ఘనతను సాధించాడు. కాగా, సాయి గతంలో అతి చిన్న వాషింగ్ మెషిన్ను తయారు చేసి మొదటిసారిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు.