BREAKING: పెందుర్తిలో రైలుకు తప్పిన ప్రమాదం
VSP: టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. పెందుర్తిలో రైల్వే పనులు జరుగుతుండగా ఓ విద్యుత్ పోల్ పక్కకు ఒరిగింది. రైల్వే ఓహెచ్ఈ విద్యుత్ వైర్లపై పోల్ పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న టాటానగర్ ఎక్స్ప్రెస్ లోకోపైలెట్ అప్రమత్తమై నిలిపివేయడంతో ప్రమాదం తప్పిందని రైల్వే సిబ్బంది తెలిపారు.