రేపు రాజమండ్రిలో నిరసన ర్యాలీ: నరేష్
EG: శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతల ప్రవర్తనను ఖండిస్తూ రేపు ఉదయం10గంటలకు ఓబీసీ మోర్చాజిల్లా అధ్యక్షుడు మురుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. గోకవరం బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాం నుండి కంబాల చెరువు దండి మార్చ్ సెంటర్ వరకు ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.