కూటమి ప్రభుత్వంలో భారీగా పెట్టుబడులు: ఎమ్మెల్యే
NLR: యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ.1232 కోట్లు కేటాయించడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి గొప్ప మలుపుగా చెప్పుకోవచ్చని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కొత్త పరిశ్రమలు రాలేదని.. ఉన్న పరిశ్రమలు తరలి వెళ్ళిపోయాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయని చెప్పారు.