జర్నలిస్టుల ధర్నాతో దద్దరిల్లిన సమాచార భవన్

జర్నలిస్టుల ధర్నాతో దద్దరిల్లిన సమాచార భవన్

HYD: జర్నలిస్టుల పట్ల రాష్ట్రప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయాన్ని నిన్న జర్నలిస్టులు ముట్టడించారు. ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా జర్నలిస్టులు చేసిన నినాదాలతో సమాచార భవన్ దద్దరిల్లింది. బడ్జెట్‌లో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.