తీగలపై పతంగులు.. కరెంటు తిప్పలు..!
MDCL: సంక్రాంతి పండుగ జరిగి నెలన్నర కావస్తున్నప్పటికీ పిల్లలు పతంగులు వదలటం లేదు. ఎదులాబాద్ గ్రామంలో పిల్లలు పతంగులు ఎగురవేస్తుండగా కరెంటు తీగల పై పడి, కరెంటు సమస్యలు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన విద్యుత్ అధికారులు, పిల్లలు ఓపెన్ గ్రౌండ్లో మాత్రమే పతంగులు ఎగురవేయాలని సూచించారు.