'రాజధాని పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నం'
ప్రకాశం: ఇంకా రాజధాని పేరుతో ప్రజలను జగన్ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రాజధానికి చట్టబద్ధత లభించడంపై ఆనందం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కల ఆట ఆడి మూడు ప్రాంతాల ప్రజలను జగన్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారన్నారు.