కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ వద్ద రైతుల ఆందోళన

కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ వద్ద రైతుల ఆందోళన

KDP: లింగాల మండలంలోని బియాండ్ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోత పథకం ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఆదివారం రైతులు ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ.. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ట్రాన్స్‌ఫార్మర్ తెప్పించినా, కనెక్షన్ ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. రైతుల విషయంలో రాజకీయాలకు తావులేకుండా అధికారులు వ్యవహరించాలన్నారు. విద్యుత్ అధికారులు కనెక్షన్ ఇవ్వకపోతే ధర్నా చేస్తామన్నారు.