రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రక్తదాన శిబిరాన్ని  ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: అన్ని దానాల కంటే రక్తదానమే మహా గొప్పదని సోమవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అభివర్ణించారు. డా. బీఆర్.అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా ఏనుగొండ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏనుగొండలోని ఆంజనేయ స్వామి ఆవరణలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు.