నేటి నుంచి ఆధార్ స్పెషల్ క్యాంప్లు

NLR: చేజర్ల మండలంలో ఆధార్ స్పెషల్ క్యాంప్లు ఈనెల 19 నుంచి 30 వరకు వివిధ సచివాలయాలలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అమర్ తెలిపారు. ఆగస్టు 19-21 తేదీలలో తూర్పుపల్లి, ఏటూరు సచివాలయాలలో, 22-23 తేదీలలో పాడేరు, ఆదురుపల్లి సచివాలయాలలో, 28-29 తేదీలలో పాతపాడు, వావిలేరు సచివాలయాలలో ఈ క్యాంపులు నిర్వహిస్తారు. నూతన ఆధార్ కార్టు ,పేరులో తప్పులు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు.