బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే భవిష్యత్తు బంగారం: ఎస్పీ

బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే భవిష్యత్తు బంగారం: ఎస్పీ

GNTR: విద్యార్థులు బాధ్యతాయుతంగా మెలిగితేనే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం వట్టిచెరుకూరు కిట్స్ కళాశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్, ర్యాగింగ్, మాదక ద్రవ్యాల వినియోగంపై ఆయన అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులను తెరవరాదని సూచించారు. డ్రగ్స్ వాడకం జీవితాలను నాశనం చేస్తాయన్నారు.