కోయిలకొండలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు

కోయిలకొండలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు

MBNR: కోయిలకొండ మండలం లింగుపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకులు భీమయ్య, ఆంజనేయులుతో పాటు 20 మంది బీఆర్ఎస్, నాయకులు, కార్యకర్తలు ఈ రోజు సీవిఆర్ భవన్‌లో మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.