పెద్దాపురం ఆర్డీఓగా మనీషా నియామకం

పెద్దాపురం ఆర్డీఓగా మనీషా నియామకం

కాకినాడ: పెద్దాపురం డివిజన్ ఇంచార్జ్ ఆర్డీఓగా ట్రైనీ కలెక్టర్ మనీషాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. పరిపాలనను మరింత వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. డివిజన్ పరిధిలోని రెవెన్యూ, భూసంబంధిత సమస్యలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించనున్నారు.