శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 20 గంటలు పడుతుంది. రూ.300 శీఘ్రదర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్ ఉన్న భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 80,502 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.88 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.