కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
JN: స్టేషన్ ఘనపూర్ మండలంలోని పామునూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఘన్పూర్ నియోజకవర్గంలో రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు.