ధూల్పేట్లో గంజాయి విక్రయాలు.. అరెస్ట్

HYD: ధూల్పేట్లోని ఒక ఇంట్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్టీఎఫ్ టీం పోలీసులు దాడి నిర్వహించారు. 1.206 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులు చంద్రముఖి, ఆకాశ్ సింగ్ను అరెస్ట్ చేశారు. ధూల్పేట్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి వెల్లడించారు.