నార్నూరులో పర్యటించిన కేంద్ర ISO బృందం
ADB: నార్నూర్ మండల కేంద్రంలో బుధవారం కేంద్ర ISO బృందం పర్యటించింది. ఈ సందర్బంగా వివిధ శాఖల మండల అధికారులు, అంగన్వాడీ టీచర్లు, నూతన పాలకవర్గంతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల రికార్డులను పరిశీలించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో DLPO ప్రభాకర్, ఎంపీడీవో గంగాసింగ్, ఎంపీవో మహేష్, సర్పంచ్ బానోత్ కావేరి ఉన్నారు.