లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్
AKP: లబ్ధిదారులకు సక్రమంగా పింఛన్లు పంపిణీ చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం అనకాపల్లి పట్టణం 84వ వార్డు పెరుగు బజారు ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పెన్షన్ల పంపిణీ విధానంపై ఆరా తీశారు. జిల్లాలో 2,53,336 మందికి సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు.