లోయర్ మానేరు జలాశయంలో రెండు గేట్లు ఎత్తివేత

లోయర్ మానేరు జలాశయంలో రెండు గేట్లు ఎత్తివేత

KNR: ఎగువ ప్రాంతాన కురుస్తున్న వర్షాలకు, మిడ్ మానేరు నుంచి వస్తున్న వరద కారణంగా లోయర్ మానేరు జలాశయం (LMD) నీటిమట్టం 24 TMCల గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ మేరకు ఎల్ఎండీ స్పిల్ వే రెండు గేట్లను ఎత్తి 4వేల క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి అధికారులు విడుదల చేశారు. రైతులు, పశువుల కాపర్లు, మత్స్యకారులు మానేరు వాగు పరిసరాల్లోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.