ఓటు హక్కు వినియోగించుకున్న శతవృద్ధుడు
SDPT: మద్దూరు మండలం లద్నూర్ గ్రామంలో బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 100 ఏళ్ల వృద్ధుడు అబ్దుల్ షమీ తన ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన స్వగ్రామంలో ఓటు వేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. శతవృద్ధుడి ఉత్సాహాన్ని చూసి తోటి ఓటర్లు, అధికారులు ఆశ్చర్యపోతూ అభినందనలు తెలిపారు.