తేజస్వి వ్యాఖ్యలను ఖండించిన మాజీ ఎంపీ
KMM: పార్లమెంట్ వేదికగా బీజేపీ సభ్యుడు తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలను ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. 15వ లోక్సభలో తాను పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనకు తొలి ఓటు వేశానని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోల్చడం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు.