వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు ఇలా..!

WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తికి రూ.7,550 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.14,800 ధర పలకగా... వండర్ హాట్(WH) మిర్చి రూ.16 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.14,300కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.