'అమరావతికి చట్టబద్ధత చారిత్రక విజయం'
VZM: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై విజయనగరంలో టీడీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. శనివారం రాత్రి గజపతినగరం నియోజకవర్గ టీడీపీ శ్రేణులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నివాసం వద్ద కొవ్వొత్తులతో దీపాలు వెలిగించి ర్యాలీ నిర్వహించారు. ఇది చారిత్రాత్మక విజయం అంటూ సంబరాలు చేసుకున్నారు.