ఎంపీ కార్యాలయంలో ప్రజా దర్బార్

KKD: ప్రజల సమస్యల పరిష్కారం దిశగా కొప్పవరంలోని ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం 18వ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పింఛన్లు, విద్య, ఇళ్ల స్థలాలు, ఉపాధి, వైద్యం తదితర అంశాలకు సంబంధించి మొత్తం 26 అర్జీలు స్వీకరించారు. వాటిలో 8 అర్జీలను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించామని కార్యాలయ ఇంఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు.